పుదుచ్చేరి, డిసెంబర్ 15: 25 దేశాలకు చెందిన 1,400 నగరాల నుంచి లక్షల మంది పరీక్షలో పాల్గొన్న అంతర్జాతీయ ఒలింపియాడ్ విజ్ఞాన పోటీలో, పుదుచ్చేరి తేంగాయ్పట్టు ఆచార్య బాలాశిక్ష పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న రక్షన్ ప్రథమ స్థానంలో నిలిచాడు. రాత, వాక్య అమరిక, చక్కగా చదివే విధానం, మాటలు, వ్యవహారిక శైలి ఆధారంగా ఎంపిక జరిగింది. ప్రధాన స్థానంలో నిలిచిన రక్షన్ పుదుచ్చేరి లెఫ్ట్నెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఆశీస్సులు అందుకోడానికి వారి తల్లిదండ్రులతో కలిసి బుధవారం గవర్నర్ భవన్కి వచ్చాడు. ఈ సందర్భంగా గవర్నర్ రక్షన్ ను తన కుర్చీలో కూర్చోబెట్టి గౌరవించారు. అతనిని కిరణ్ బేడి ఆశీర్వదించి దేశం గర్వించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.