అహ్మదాబాద్, డిసెంబర్ 14 : గుజరాత్ రెండో దశ శాసనసభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ మేరకు ప్రధాని పోలింగ్ కేంద్రం దగ్గరకు రాగానే ప్రజలంతా "మోదీ మోదీ" అని నినాదాలు చేశారు. దీంతో మోదీ చిరునవ్వుతో వారికి అభివాదం చేశారు. ఆయన ఒక సామాన్య పౌరుడిలా సబర్మతీలోని రాణిప్ ప్రాంత౦లో ఉన్న పోలింగ్ కేంద్రంలో క్యూలైన్లో నిల్చుని ఓటేశారు. ఓటు హక్కును వినియోగించుకున్న వారిలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ, పాటిదార్ నేత హార్దిక్ పటేల్ ఉన్నారు. కాగా నేడు మిగతా 93 స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా ఉదయం నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు 39శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారి వెల్లడించారు.