అనుమానాస్పద స్థితిలో నర్సు మృతి

SMTV Desk 2017-06-16 18:19:09  flash news, suicide nurse in hospital, indo american cancer hospital, sravani, shravani, sravai suicide, shravai suicide

హైదరాబాద్, జూన్ 16: బంజారాహిల్స్‌ లోని బసవతారకం ఇండో-అమెరికన్‌ క్యాన్సర్ ఆసుప‌త్రిలో ఈ రోజు అల‌జ‌డి చెల‌రేగింది. 21 ఏళ్ల‌ శ్రావ‌ణి అనే నర్సు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న‌ పోలీసులు శ్రావణి కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు ప్రారంభించారు. శ్రావణి ఆత్మహత్య చేసుకుంద‌ని పోలీసులు భావిస్తున్నారు. అదే ఆసుప‌త్రిలో శ్రావణి తల్లి కూడా న‌ర్సుగా పనిచేస్తోంది. శ్రావ‌ణి మృతదేహాన్ని బసవతారం ఆసుప‌త్రిలోని మార్చురీకి తరలించారు. ఆమె తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఆమె ఎందుకు ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌నే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.