అహ్మదాబాద్, డిసెంబర్ 14 : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రారంభమైంది. ఈ నెల 9 వ తేదీన తొలి దశ ఎన్నికల్లో మొత్తం 89 స్థానాలకు పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ రోజు ఎన్నికల్లో 182 స్థానాలకు ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. మొత్తం ఈ రెండో విడతలో 851 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, వీరిలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నితిన్ పటేల్, కాంగ్రెస్లో చేరిన ఓబీసీ నేత అల్పేశ్ ఠాకూర్, దళిత నేత జిగ్నేశ్ మేవాని వంటి ప్రముఖులు ఉన్నారు. కాగా ఈ నెల 18 వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.