ఆరంభంలోనే ఆదరగోట్టేసిన సుందర్...

SMTV Desk 2017-12-13 15:47:31  sundhar, one day series, srilanka, india,

మెహలీ, డిసెంబర్ 13: భారత్ తో జరుగుతున్న రెండో వన్డేలో లంక జట్టు 4 వికెట్లు కోల్పోయి౦ది. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ లో అద్భుతమైన ప్రదర్శన చూపించిన భారత ఆటగాళ్ళు, ఫీల్డింగ్ లో అదే కసి తీర్చుకుంటున్నారు. లంక ఓపెనర్లు గుణతిలక(16) బుమ్రా,దక్కించు కోగ, ఉపుల్‌ తరంగా(7)ను పాండ్యా పెవిలియన్‌కు పంపించాడు. అంతేకాదు, అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన 18 ఏళ్ల చెన్నై కుర్రాడు వాషింగ్టన్ సుందర్, తిరమన్నే(21)ను ఔట్ చేయగా, డిక్వెల్లా(22) ను చాహల్ దక్కించుకున్నాడు. దీంతో 25 ఓవర్లు ముగిసే సరికి 131 పరుగులతో లంక జట్టు ఉంది. క్రీజులో మాధ్యుస్ (46), గుణరత్నె (14) ఉన్నారు.