వైసీపీ ఆరోపణలకు బదులిచ్చిన మంత్రి ప్రత్తిపాటి

SMTV Desk 2017-12-13 15:33:53  Candrannamals, minister prathipati pullarao, ycp

విజయవాడ, డిసెంబర్ 13 : చంద్రన్నమాల్స్‌పై వైసీపీ ఆరోపణలు చేయడం సరికాదని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. బుధవారం విద్యాధరపురంలో చంద్రన్న వీలేజ్‌మాల్‌లో సరుకుల ధరలు, నాణ్యతను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...రేషన్‌కు.. చంద్రన్నమాల్స్‌కు సంబంధం లేదని అన్నారు. చంద్రన్నమాల్స్‌లో 500 రకాల సరుకులు లభిస్తున్నాయని అన్నారు. భారతీ సిమెంట్ తక్కువ ధరకు ఎందుకు అమ్మడం లేదని మంత్రి వైసీపీని ప్రశ్నించారు. నాణ్యమైన సరుకులు తక్కువ ధరకు ఇవ్వడం వైసీపీకి ఇష్టం లేకే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అందుకే పథకాలు, పేర్లు గురించి విమర్శించే అర్హత వైసీపీకి లేదని ప్రత్తిపాటి పేర్కొన్నారు.