హైదరాబాద్, డిసెంబర్ 13 : ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ కళాశాల తొలి వార్షికోత్సవానికి గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "పేద, ధనిక వర్గాల మధ్య వ్యత్యాసాలు తగ్గించేందుకు వ్యవసాయ వర్శిటీలు కృషి చేయాలి. అలాగే వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య వర్శిటీలు ఒకే గొడుగు కిందకు రావాలి" అని పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధి దృష్ట్యా రైతులకు చేయూతనిచ్చి ఆహార సమతుల్యతను పాటించే విధంగా పరిశోధనలు విస్తృతం చేయాలని తెలిపారు. వీటితో పాటు గ్రామాలను దత్తత తీసుకుని వాటి అభివృద్దికి నిరంతరం కృషి చేయాలంటూ సూచించారు.