చిత్తూరు, డిసెంబరు 13 : పెళ్ళైన తొలిరాత్రే భార్య శైలజను.. భర్త రాజేశ్ అతి కిరాతకంగా హింసించిన విషయం తెలిసిందే. అయితే, ఈ శాడిస్టు భర్త రాజేశ్కు పుంసత్వ పరీక్షలు నిర్వహించేందుకు కోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలో పుంసత్వ పరీక్షలకు రాజేశ్ను పంపడం చట్టవిరుద్ధమని అతని లాయర్ తిరిగి వాదించారు. చివరకు హైదరాబాద్లోని ఫోర్సెనిక్ ల్యాబ్లో ఆయనకు పుంసత్వ పరీక్ష చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.