అహ్మదాబాద్, డిసెంబరు 13 : ఆ మధ్య కాలంలో ఆన్లైన్లో వచ్చిన బ్లూవేల్ గేమ్ వల్ల అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా ప్రధాని మోదీ గుజరాత్ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో కాంగ్రెస్ ను ఉద్దేశించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమ౦టూ స్పష్టం చేస్తూ.. ఆ పార్టీ బ్లూవేల్ గేమ్లో చిక్కుకుందని ఆరోపించారు. ఇటీవల రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. "కొందరు పారిశ్రామికవేత్తల కోసమే మోదీ పనిచేస్తున్నారు" అన్న ఆరోపణలను ఖండిస్తూ.. పై వ్యాఖలు చేశారు. ఎన్నికల ఫలితాలు ఈ నెల 18 వ తేదీన వెలువడనున్నాయి.