అహ్మదాబాద్, డిసెంబరు 13 : గుజరాత్ ఎన్నికల ప్రచార పర్వం నిన్నటితో ముగిసింది. ఎన్నెన్నో విమర్శలు, మరెన్నో ప్రతి విమర్శల మధ్య జరిగిన ఈ పోరులో తుది పోలింగ్ రేపు జరగనుంది. తొలి విడత ఎన్నికలు డిసెంబర్ 9 న ముగిసిన విషయం తెలిసిందే. తుది పోలింగ్లో భాగంగా 93 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ప్రచారంలో బీజీపీ తరపున మోదీ, కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ పూర్తి బాధ్యత వహించారు. కాగా ఈ 18 వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.