మెహలీ, డిసెంబర్ 13: మెహలీ వేదికగా భారత్-శ్రీలంకల మధ్య జరగనున్న రెండో వన్డే మ్యాచ్ లో లంక జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ను ఎంచుకుంది. తొలి వన్డేలో ఓటమి పాలైన రోహిత్ సేన ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను 1-1తో సమం చేయాలనీ భావిస్తోంది. భారత్ జట్టులో ఒక్క మార్పు చోటుచేసుకుంది. కుల్దీప్ యాదవ్ స్థానంలో యువ ఆటగాడు వాషింగ్టన్ సుంధర్ను తీసుకున్నారు. ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్ లో గెలిచిన లంక జట్టు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుంది. జట్లు భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), ధావన్, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, మనీశ్ పాండే, ధోని, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్, వాషింగ్టన్ సుంధర్, బుమ్రా, చహల్. శ్రీలంక: తిసారా పెరీరా (కెప్టెన్), గుణతిలక, తరంగా, తిరిమన్నే, ధనంజయ డిసిల్వా, మాథ్యూస్, డిక్వెలా, గుణరత్నే, సచిత్, లక్మల్, అకిల ధనంజయ, ప్రదీప్.