త్వరలో అనంతపురంలో జనాసేన పార్టీ కార్యాలయ నిర్మాణం

SMTV Desk 2017-12-12 18:38:19  janasena party, pavan kalyan, anantapuram guththi dist

అనంతపురం, డిసెంబర్ 12 : త్వరలో జనసేన పార్టీ కార్యాలయాన్ని చేపడుతున్నట్లు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా గుత్తి రోడ్డులోని రెండెకరాల విస్తీర్ణంలో కార్యాలయానికి శంకుస్థాపన చేయనున్నట్లు పవన్ తెలిపారు. అదేవిధంగా పార్టీ కార్యాలయాన్ని విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. తాజాగా ఈ విషయాన్ని ప్రకటించిన నేపథ్యంలో, రానున్న ఎన్నికల్లో ఆయన, అనంతపురం నుంచే బరిలో దిగే అవకాశం ఉందని సమాచారం.