రిలయన్స్ వ్యూహ ప్రణాళిక...

SMTV Desk 2017-12-12 17:43:26  reliance jio, reliance, intial public offering,

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: టెలికాం దిగ్గజ౦, రిలయన్స్ సంస్థ కొత్త సంవత్సరానికి కొత్త ప్రణాళికను సిద్ధం చేస్తోంది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన రిలయన్స్‌ జియో, 31 బిలిలయన్‌ డాలర్ల(రూ.1,99,779కోట్లు) పెట్టుబడుల తరువాత జియో ఇన్‌షియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌కు వస్తోంది. జియో ఐపీఓ కోసం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అంతర్గత చర్చలు చేస్తున్నట్టు తెలిపింది. జియోకి ఈ ఐపీఓ 2018లో కాని, 2019 ప్రారంభంలో కాని వచ్చే విధంగా రిలయన్స్‌ సూచిస్తుంది. ఇదిలా ఉండగా నేటి మార్కెట్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు 0.29 శాతం లాభంలో రూ.918.60 వద్ద ముగిసింది.