జమ్మూకశ్మీర్, డిసెంబర్ 12 : ప్రధాని మోదీపై జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మోదీకి అహ్మదాబాద్ రోడ్ షోకు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సముద్ర విమానయాన ప్రయాణం చేశారు. ఈ విషయంపై ఒమర్ విలేకరులతో మాట్లాడుతూ.. "ప్రధాని రోడ్ షో కు అనుమతి నిరాకరించడంతో సింగిల్ ఇంజిన్ ఉన్న సీ ప్లేన్ పై ధరోయ్ డ్యాంకు వెళ్లడం ఏంటి.? ఇది ఒక రకంగా భద్రతా పరమైన నియమ నిబంధనలను ఉల్లంఘించడమే. అయినా ప్రధాని వంటి వీవీఐపీలు ఇలాంటి సింగిల్ ఇంజిన్ విమానాలలో ప్రయాణించడం నిబంధనలకు విరుద్ధం" అంటూ వ్యాఖ్యానించారు.