కనిష్ఠ౦లో పసిడి ధర...

SMTV Desk 2017-12-12 16:23:36  GOLD, SILVER RATES, MCX MARKET,

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: దేశీయ మార్కెట్లలో పసిడి ధరలు క్రమంగా తగ్గు ముఖం పట్టాయి. నేటి మార్కెట్‌లో రూ.180 తగ్గడంతో బంగారం ధర నాలుగు నెలల కనిష్ఠానికి పడిపోయింది. ప్రస్తుతం బులియన్‌ మార్కెట్లో 10 గ్రాముల పసిడి రూ. 29,400గా, కేజీ వెండి రూ. 25 తగ్గి రూ. 37,775గా ఉంది. కొనుగోలుదారులు మందగించడం కారణంగా ధరలు పడిపోయినట్లు మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. ప్రస్తుతం అంతర్జాతీయంగానూ 0.54శాతం తగ్గి ఔన్సు బంగారం ధర 1,241.40 డాలర్లుగా, ఉంది.