హైదరాబాద్, డిసెంబర్ 12: భారత్ క్రికెట్ మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ తాజాగా ఓ రికార్డును సమం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంతకి ఏం రికార్డు అనుకుంటున్నారా... దాదా సౌరవ్ గంగూలీ తన వన్డే కెరీర్లో మొత్తం 311 వన్డేలు ఆడాడు. ఇప్పటికే మహీ తన కెరీర్లో 310వ వన్డేలు ఆడాడు. మొహాలిలో ఆడబోయేది 311 కాగా , ఆ తర్వాత విశాఖలో జరగబోయే మ్యాచ్తో గంగూలీ రికార్డును దాటేస్తాడు. మహ్మద్ అజహరుద్దీన్ (334), రాహుల్ ద్రవిడ్ (344), సచిన్ తెందుల్కర్ (463) అతనికన్నా ముందున్నారు.