కాకినాడ, డిసెంబర్ 12 : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాపులను బీసీలో చేర్చి ఒక అడుగు ముందుకేశారని కాపు నేత ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. కాకినాడలో కాపు జేఏసీ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. "కాపులను బీసీల్లో చేర్చి, వారికి 5 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో చంద్రబాబు చిత్తశుద్ధితో ఉన్నారన్న విషయాన్ని నమ్ముదాం. ఆయన ఒకవేళ ఏదైనా మోసం చేస్తే అప్పుడు చూద్దాం. మనం కూడా మోసం చేద్దాం" అంటూ వ్యాఖ్యానించారు. ఒక్క శాతం కూడా బీసీలకు రిజర్వేషన్ లను తగ్గిస్తే సహించేది లేదని వెల్లడించారు. పూర్తి స్థాయిలో రిజర్వేషన్లను సాధించడానికి కాపు యువత సిద్ధంగా ఉండాల౦టూ పిలుపునిచ్చారు.