సముద్ర విమాన ప్రయాణంలో ప్రధాని...

SMTV Desk 2017-12-12 13:00:10  prime minister, modi, sea plane, ambaji temple, gujarath.

అహ్మదాబాద్‌, డిసెంబర్ 12 : ప్రధాని నరేంద్రమోదీ దేశంలోనే మొట్టమొదటి సారిగా సముద్ర విమాన ప్రయాణం చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. దేశంలోనే సముద్ర విమాన ప్రయాణం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ ప్రయాణం అహ్మదాబాద్‌లోని సబర్మతీ నది నుండి ధరోయ్‌ డ్యామ్‌ వరకు సాగింది. అక్కడి నుండి మోదీ రోడ్డు మార్గం గుండా అంబాజీ వెళ్లి.. అంబా మాత ఆలయంలో పూజలు చేశారు. ఈ ప్రయాణం గురించి మోదీ తన ట్విట్టర్ వో వివరిస్తూ.. రోడ్‌షో కోసం అనుమతి లభించకపోవడంతో అంబాజీ ఆలయానికి సీప్లేన్‌లో వెళ్తున్నా. అన్నిచోట్లా ఎయిర్‌పోర్టులు నిర్మించే పరిస్థితి లేదు. అందుకని ప్రభుత్వం సముద్ర విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.