న్యూఢిల్లీ, డిసెంబర్ 12: బుల్లితెరపై ప్రసారమయ్యే కండోమ్ ప్రకటనలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రకటనలు ప్రసారం చేయొద్దని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటనల వల్ల చిన్నపిల్లలపై ప్రభావం పడే అవకాశం ఉందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కేబుల్ టెలివిజన్ నెట్వర్క రూల్స్, 1994 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా గత సెప్టెంబరులో, సన్నీ లియోన్ నటించిన ఒక కండోమ్ ప్రకటన సూరత్లో నిరసన సెగలు రాజేసింది. గుజరాత్ నగరం అంతటా దర్శనమిచ్చిన ఈ హోర్డింగ్స్ పై పలువురు మహిళ నేతలు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే.