తిరుమల, డిసెంబర్ 12 : నేడు ఉదయం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారిని వైకాపా ఎమ్మెల్యే ఆర్కే రోజా దర్శించుకున్నారు. ఉదయాన్నే వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న రోజా కు ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా రోజా మీడియాతో మాట్లాడుతూ... ఎల్1 దర్శనాలు అనర్హులకు కేటాయిస్తున్నారని, వీఐపీ దర్శనాల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. రోజాతో పాటు పార్టీ నేతలు పలువురు దర్శనానికి విచ్చేశారు.