హామిల్టన్, డిసెంబర్ 12: వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో కివీస్ తొలి ఇన్నింగ్స్లో 373 పరుగులు చేయగా వెస్టిండీస్ 221కి ఆలౌటైంది. మరుసటి రోజు రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన కివీస్ ఆటగాడు రాస్ టేలర్ సాధించిన అజేయ శతకంతో దూసుకెళ్ళి౦ది.198 బంతుల్లో సెంచరీ తన కైవసం చేసుకొని అతని గురువు మాజీ క్రికెటర్ మార్టిన్ క్రోకు సమంగా నిలిచాడు. టేలర్ కెరియర్ లోనే ఇది 17వ టెస్టు శతకం. ఈ సందర్బంగా తను గురువు (క్రో) ను తలుచుకొని బావోద్వాగానికి గురి అయ్యాడు. అనంతరం టేలర్ మీడియాతో మాట్లాడుతూ... మార్టిన్ క్రోతో మంచి సాన్నిహిత్యం ఉందని, ఎప్పుడు బ్యాటింగ్, మార్గనిర్దేశం గురించే చెప్పేవారని అన్నాడు. కివీస్ రెండో ఇన్నింగ్స్ను 291/8కి డిక్లేర్ చేయాగ, మూడో రోజు ఆటముగిసే సరికి ఎనిమిది ఓవర్లు ఆడిన విండీస్ 30/2తో ఉంది.