మహిళలు చాలా గొప్పవారు : కరీనా కపూర్

SMTV Desk 2017-12-11 17:39:01  lux goden rush programme, tapsi, karina kapoor, bhoomi, casting couch issue

ముంబై, డిసెంబర్ 11 : బాలీవుడ్ హిట్ సినిమా దంగల్ నటి, జైరా వసీం పై వికాస్ సచ్దేవ్అనే వ్యక్తి వేధింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఎయిర్ విస్తారాలో ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న సమయంలో తనపై లైంగిక వేధింపులు జరిగాయని ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఆరోపించింది. అయితే ఈ విషయం పై బాలీవుడ్ హీరోయిన్లు కరీనా కపూర్‌, తాప్సి, భూమి పెడ్నేు బాధితురాలికి మద్దతుగా నిలిచారు. లక్స్‌ గోల్డెన్‌ రోస్‌ అవార్డుల వేడుకలో పాల్గొన్న వీరు ఈ సంఘటన పై స్పందించారు. కరీనా మాట్లాడుతూ...."మనం (మహిళలు) పోరాడేవాళ్లం. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మనం పోరాడాలి. దేవుడి గురించి మాట్లాడేటప్పుడు దేవత గురించి కూడా చెబుతాం. భూమి గురించి మాట్లాడేటప్పుడు నేలతల్లి అంటాం. ఇలా మనం దేని గురించి మాట్లాడినా మహిళల ప్రస్తావన ఉంటుంది. మహిళలు చాలా గొప్పవారు" అని కరీనా చెప్పారు. తాప్సి మాట్లాడుతూ..." ఆమె తనకు జరిగిన ఘటనను బహిర్గతం చేయడం గొప్ప విషయం. ఆమెకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా. " అని వ్యాఖ్యానించారు. ఇదే సంఘటన పై భూమి పెడ్నేు స్పందిస్తూ..."తను చిన్న పిల్ల. ప్రజలు స్టార్స్‌ను తమ సొంత ఆస్తుల్లా భావిస్తున్నారని. ఆమె సామాజిక మాధ్యమాల్లో ఈ విషయాన్ని చెప్పడం సంతోషం." అని చెప్పుకొచ్చారు.