పది మంది ప్రాణాలను బలిగొన్న పొగ మంచు...

SMTV Desk 2017-12-11 17:29:49  road accident, snow fall, uttarapradesh, meerjapur,

లఖ్ నవూ, డిసెంబర్ 11: పొగ మంచు కారణంగా ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... మీర్జాపూర్‌ సమీపంలో మదిహాన పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఒక ట్రాక్టర్‌, ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది మృత్యువాత పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి దట్టంగా అలుముకున్న పొగ మంచే కారణమని పోలీసులు తెలిపారు.