సోమాలియాలో ఉగ్రవాదుల అలజడి

SMTV Desk 2017-06-16 13:45:17  terrorist, rest rent, somaliya

మొగదిషు, జూన్ 16 : ఉగ్రవాదులు ఈ మధ్య కాలంలో చాలా చోట్ల కాల్పులు జరిపి అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. ఇలాంటి సంఘటనే మొగదిషు లో జరిగింది. సోమాలియా రాజధాని మొగదిషులో ఉగ్రవాదులు గురువారం తెల్లవారు జామున రెండు గంటలకు పిజ్జాహౌస్ బయట ఉన్న కారులో బాంబు పెట్టి పేల్చరు. అనంతరం ఉగ్రవాదులు రెస్టారెంట్ లోకి ప్రవేశించి అక్కడ ఉన్న వాళ్ళపై జరిపారు. ఈ కాల్పుల్లో 31 మంది అక్కడికక్కడే మృతి చెందగా మరో 40 మందికి తీవ్ర గాయాలయ్యాయని సీనియర్ పోలీస్ అధికారి కెప్టెన్ మహ్మద్ హుస్సేన్ తెలిపారు. తరువాత రెస్టారెంట్ చుట్టు ముట్టిన భద్రతాదళాలు 2 గంటల నుంచి ఉదయం వరకు శ్రమించి ఐదుగురు ఉగ్రవాదులను కాల్చి చంపారని వెల్లడించారు. రెస్టారెంట్ లో ఐదుగురు బాలికల మృతదేహాలు దొరికాయి. వాళ్ళను కూడా తీవ్రవాదులే చంపి ఉంటారని పేర్కొన్నారు. అక్కడ జరిగిన భారీ బాంబు పేలుళ్లతో ఆ రెస్టారెంట్ తో చుట్టూ పక్కల ఉన్న భవనలు కూడా దెబ్బతిన్నాయని చెప్పారు.