ముంబాయి, డిసెంబర్ 11: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల బాట పడుతూ ప్రారంభమయ్యాయి.సెన్సెక్స్ 182 పాయింట్లు పెరిగి 33,431వద్ద , నిఫ్టీ 53 పాయింట్లు పుంజుకుని 10,319వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ప్రభావంతో పాటు దేశీయ పెట్టుబడి దారుల నుంచి కొనుగోళ్లు మార్కెట్ సెంటిమెంట్కు కలిసొచ్చాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, ఐషర్ మోటార్స్, రిలయన్స్, మారుతి సుజుకీ, అరబిందో ఫార్మాభారతీ, జీ, యాక్సిస్, ఎస్బీఐ, విప్రో, యూపీఎల్, అల్ట్రాటెక్, ఐషర్, బాష్, లాభాలలో కొనసాగుతున్నాయి.