అవినీతిలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఒకే పద్ధతి పాటిస్తున్నారు : కె.లక్ష్మణ్‌

SMTV Desk 2017-12-11 11:41:37  BJP state president K Laxman, comments on trs party, congress party.

భువనగిరి, డిసెంబర్ 11 : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ల వైఖరిని తప్పు పడుతూ వారిపై విమర్శలు సంధించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. "జలయజ్ఞం పేరుతో కాంగ్రెస్‌ భారీ అవినీతికి పాల్పడి౦ది. కాబట్టే నేటి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించలేకపోతోంది. ప్రజలను మోసం చేయడంలో, అవినీతి పాలనలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు ఒకే రకమైన పద్దతిని పాటిస్తున్నారు. దీంతో ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారు. అధ్యక్షుడు అమిత్‌ షా చేపట్టనున్న పర్యటనతో అనేక మార్పులు సంభవిస్తాయి" అంటూ వ్యాఖ్యానించారు.