గుజరాత్ లో మళ్లి అధికారం బీజేపీదే: అమిత్ షా

SMTV Desk 2017-12-11 11:22:35  amit shah, gujarath, elections, result, power, 150

అహ్మదాబాద్, డిసెంబర్ 11: 14 వ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లి బీజేపీదే అధికారం అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 9న తొలిదశ ఎన్నికలు పూర్తయిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పాటీదర్ లతో తమది పేగు బంధమని గుజరాత్ ప్రజలు కుల రాజకీయాలను ఆదరించారని, వారు అభివృద్దిని నమ్ముకోవటం వల్లే గత 22 సంవత్సరాలుగా బీజేపీకి అధికారం ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గతంలో కంటే ఎక్కువగా ఈసారి 150 స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని షా తెలిపారు. నోట్లరద్దు, జీఎస్టీ ని ప్రజలు ఆర్దిక అంశాలుగానే చూశారు కాని, రాజకీయకోణ౦లో చూడలేదని అమిత్ షా పేర్కొన్నారు. గుజరాత్ లో కాంగ్రెస్ ను ప్రజలు విశ్వసించరని రాహుల్ అపరిపక్వ నాయకుడని ఆయన విమర్శించారు.