న్యూఢిల్లీ, డిసెంబర్ 11: కొత్త సంవత్సరంలో ఉద్యోగులకు ఓ శుభవార్త. భారతీయ కంపెనీల్లో నైపుణ్యం ఉన్న ఉద్యోగుల వేతనాలను 10-15 శాతం పెరిగే అవకాశం ఉందని ఎంప్లామెంట్ సర్వీసెస్ ప్రొవైడర్ టీమ్లీస్ సర్వీసెస్ సహ వ్యవస్థాపకులు రితూపర్ణ చక్రవర్తి తెలిపారు. అంతేకాదు తమ నైపుణ్యాలను పెంచుకున్న వారిని సంస్థ త్వరగా గుర్తిస్తుందన్నారు. మరోపక్క నియామకాలు కూడా పెరిగే అవకాశం ఉందని, 2017లో ఎదుర్కొన్న ఒడుదొడుకుల నుంచి కోలుకుని కొత్త సంవత్సరం కొత్త వారికి కూడా అవకాశాలు వస్తాయని అన్నారు. పెద్దనోట్ల రద్దు తర్వాత ఐటీ, టెలికాం, తయారీ, ఇంజినీరింగ్, బ్యాంకింగ్ రంగాల్లో ఉద్యోగులను భారీ గా తొలగించిన విషయం తెలిసిందే. దీని వల్ల ఉద్యోగ కొరత భారీ స్థాయిలో ఏర్పడింది.