గుజరాత్, డిసెంబర్ 10 : మణిశంకర్ అయ్యర్ ఇటీవల ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శించిన విషయం విదితమే. ఇందు నిమిత్తం కాంగ్రెస్ పార్టీ నుండి ఆయనను తొలగిస్తున్నట్లు రాహుల్ గాంధీ ప్రకటించారు. ప్రస్తుతం మోదీ, మణిశంకర్ అయ్యర్పై విమర్శల దాడి కొనసాగుతూనే ఉంది. తాజాగా మోదీ స్పందిస్తూ.. నన్ను అడ్డు తొలగించుకోవడానికి పాకిస్థాన్లో సుపారీ ఇచ్చారు. ఇప్పుడు బనస్కాంతలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో నన్ను టార్గెట్ చేశారు. కాగా పాక్ హైకమిషనర్ సోహైల్ మహ్మద్ను కలిశారని ఆరోపిస్తున్న క్రమంలో రహస్యంగా పాకిస్థానీయులతో సమావేశం కావాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. పాకిస్థాన్ ఆర్మీ మాజీ డైరెక్టర్.. అహ్మద్ పటేల్ను ముఖ్యమంత్రిని చేసేందుకు హామీ ఇచ్చారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.