ధర్మశాల, డిసెంబర్ 10: భారత్ - శ్రీలంకల మధ్య సిరీస్ లో బాగంగా జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో లంక జట్టు గెలుపును తన కైవసం చేసుకుంది. భారత్ పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 20.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయిన శ్రీలంక జట్టు 114 పరుగులు చేసి సునాయాసంగా గెలిచింది. టీంమిండియా 38.2 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి, 112 పరుగులు చేసి ఆలౌట్ కావడం అభిమానులను నిరాశపరిచింది.