న్యూఢిల్లీ, డిసెంబర్ 10 : ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రధాని మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాజస్థాన్ లో నిర్వహించిన లవ్ జిహాద్ అనే అంశంపై మాట్లాడిన ఆయన.. దేశం మొత్తం అఫ్రజుల్ హత్యను ఖండించి౦దని మోదీ మాత్రం ఈ ఘటనపై స్పందించలేదని ఆరోపించారు. ఈ సందర్భంగా ఒవైసీ మాట్లాడుతూ.. "ప్రధాని మోదీ అన్ని అంశాలపైనా మాట్లాడతారు గానీ, అసలు సమస్యలపై మాత్రం ఆయన నోరు మెదపరు" అంటూ మండిపడ్డారు. యాభై సంవత్సరాల వ్యక్తి లవ్ జిహాద్ కు పాల్పడ్డారని వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఒక్క ముస్లిం అనే కారణంతోనే ఇలాంటి దాడులు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.