ధర్మశాల, డిసెంబర్ 10: లక్ష్యచేధనలో దిగిన శ్రీలంక 3 వికెట్లను కోల్పోయింది. టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో జస్ప్రీత్ బుమ్రా వేసిన 3.4వ బంతికి ఓపెనర్ గుణతిలక ఒక పరుగుకే ఔట్ అయ్యాడు. ఆ తరువాత భువనేశ్వర్ కుమార్ వేసిన 6.1వ బంతికి తిరిమానె పరుగులేమి చేయకుండా బౌల్డ్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన తరంగ అర్ధశతకం వైపు వస్తుండగా హార్దిక్ పాండ్య వేసిన 12.3 బంతికి 46 బంతుల్లో 49 పరుగులతో ఔట్ అయ్యాడు. మొత్తం 17 ఓవర్లు ముగిసేసరికి 91 పరుగులతో లంక జట్టు ఉంది. ప్రస్తుతం నిరోషన్ డిక్వెలా (12), ఏంజెలో మాథ్యూస్ (17)క్రీజులో ఉన్నారు.