విషాదంలో బుమ్రా...

SMTV Desk 2017-12-10 16:34:50  Jaspreet Bumra, santhosh singh sucide, one day series

ఆహ్మదాబాద్, డిసెంబర్ 10: ధర్మశాలలో శ్రీలంకతో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో ఆడుతున్న టీం ఇండియా పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. అదృశ్యమైన బుమ్రా తాతయ్య సంతోక్‌ సింగ్‌ బుమ్రా(84) మృతదేహం సబర్మతి నదిలో లభ్యమైంది. ఆయన మృతదేహాన్ని అహ్మదాబాద్‌ ఫైర్‌ అండ్‌ ఎమర్జెన్సీ సర్వీసెస్‌ అధికారులు ఆదివారం గుర్తించారు. డిసెంబర్‌ 6న బుమ్రా పుట్టినరోజును పురస్కరించుకుని ఝార్ఖండ్‌ నుంచి ఆహ్మదాబాద్ కు వచ్చిన సంతోక్‌ సింగ్‌ను, బుమ్రాను కలవడానికి అతని తల్లి దల్జీత్‌ కౌర్‌ ఒప్పుకోకపోవడంతో మనస్తాపానికి గురై ఈ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.