గోవా ముఖ్యమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు...

SMTV Desk 2017-12-10 16:27:50  Goa Chief Minister Manohar Parrikar, interesting comments on army attacks.

పనాజీ, డిసెంబర్ 10 : గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌.. సైన్యం మెరుపు దాడుల గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పనాజీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పారికర్‌ మాట్లాడుతూ.. దాడులకు సంబంధించిన ప్రణాళికలు, నిర్వహణ తీరును సైన్యం రహస్యంగా ఉంచారు. అసలు ఈ దాడులకు ముందు ఉన్నతాధికారులు విదేశాలకు వెళ్లారని అన్నారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌కు అవసరమైన సామాగ్రిని చివరి నిమిషంలో కొనుగోలు చేశారని పేర్కొన్నారు. నియంత్రణ రేఖ దాటి పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న ఏడు ఉగ్రవాద శిబిరాలపై భారత్‌ మెరుపు దాడులు చేసింది. ఆ సమయంలో ఆర్మీ ఉన్నతాధికారులు, రక్షణ శాఖ అధికారులకు దాదాపు 18 సమావేశాలు నిర్వహించారు. ఆ సమయంలో తనపై మానసిక ఒత్తిడి ఉండేదని వెల్లడించారు.