ధర్మశాల, డిసెంబర్ 10: భారత్ వికెట్ల పతనం ఆట ఆరంభంలోనే ప్రారంభమై చివరి వరకు కొనసాగింది. మూడు వన్డేలలో సిరీస్లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ 112 పరుగులు చేసి కుప్పకూలింది. అత్యంత అనుభవజ్ఞుడైన మహేంద్రసింగ్ ధోనీ 87 బంతుల్లో 65 పరుగులు చేయాగ 10 ఫోర్లు, 2 సిక్సర్లలతో బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడటంతో టీమిండియా అత్యల్ప స్కోరు బారిన పడకుండా తప్పించుకుంది. తాజాగా నమోదైన భారత్ స్కోర్ అత్యల్ప స్కోర్ గా 14 వ స్థానంలో రికార్డుకెక్కింది. లంక బౌలర్లలో సురంగ లక్మల్ (10-4-13-4) నిప్పులు చెరిగే బంతులు విసిరాడు. నాలుగు వికెట్లు తీశాడు. నువాన్ ప్రదీప్ 2, తిసారీ పెరీరా, అఖిల ధనంజయ, పథిరన, ఏంజెలో మాథ్యూల్ తలో వికెట్ తీశారు.