అహ్మదాబాద్, డిసెంబర్ 10 : గుజరాత్ అసెంబ్లీ శాసన సభ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతున్న వేళ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీకి చేదు సంఘటన ఎదురైంది. ప్రచార కార్యక్రమాలలో భాగంగా రాహుల్గాంధీ ఖేదా దకోర్లోని శ్రీ రంఛోడ్జీ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి వస్తున్న సమయంలో అక్కడ ఉన్న ప్రజలు "మోదీ.. మోదీ" అంటూ నినాదాలు చేస్తారు. కాని రాహుల్ చిరునవ్వుతో అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇలాంటి సంఘటన గతంలో ఎదురైనప్పుడు రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.