ముంబై, డిసెంబర్ 10 : ఇకపై కేన్సర్ వ్యాధికి అతి తక్కువ ధరకే చికిత్స అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. దీనికి ఐఐటీ ముంబైకి చెందిన డాక్టర్ రోహిత్ శ్రీవాస్తవ కేవలం రూ. 10వేలతో కేన్సర్కు మందును కనిపెడుతున్నారు. ఎలాంటి సర్జరీలు, కీమో థెరపీలు అవసరం లేకుండా నయం చేయడానికి టెక్నాలజీని రూపొందిస్తున్నారు. నానో షెల్స్లో కేన్సర్ నిరోధక మందులను నింపి, వాటిపై అతి సూక్ష్మమైన బంగారు కణాలను పూతగా పూస్తారు. ఆ షెల్స్ను కేన్సర్ కణాల పైకి వదిలి, ఇన్ఫ్రారెడ్ లైట్తో వేడి చేస్తారు. అప్పుడు షెల్స్లో ఉన్న కేన్సర్ నిరోధక మందులు బయటకు వచ్చి కేన్సర్ కణాలపై దాడిచేసి ఆ కణాలను చంపేస్తాయి. ఈ ప్రయోగంలో మొదటి దశ పూర్తయిందని త్వరలోనే రెండో దశ పరీక్షలు పూర్తి చేస్తామని శ్రీవాస్తవ పేర్కొన్నారు.