న్యూఢిల్లీ, డిసెంబర్ 10 : ప్రస్తుతం ఉన్న రైళ్లలో విమానం తరహాలోనే జీవ మరుగుదొడ్ల స్థానంలో ‘బయో వాక్యూం’ మరుగుదొడ్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకోనున్నారు. నూతన ఏడాది నుంచి రాజధాని, శతాబ్ది వంటి ముఖ్యమైన రైళ్లలో ఇలాంటి 100 ‘అనుభూతి’ విలాసవంత పెట్టెల్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. దుర్వాసనల్ని రానీయకపోవడమే కాకుండా నీటి వినియోగాన్ని తగ్గించడం వీటి ప్రత్యేకత. ఎగ్జిక్యూటివ్ ఛైర్కార్ పెట్టెల స్థానంలో వీటిని తీసుకువస్తారు.