ధర్మశాల, డిసెంబర్ 10: శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ లో భారత్ ఆదిలోనే 5 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఆటను ప్రారంభించిన ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్శర్మ వికెట్లు కోల్పోయారు. ధావన్ డకౌట్ కాగా, రోహిత్శర్మ 2 పరుగులే చేసి పెవిలియన్కు చేరాడు. అ తరువాత బ్యాటింగ్ కు దిగిన దినేష్ పరుగులేమి చేయకుండానే ఎల్బీ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ (9) క్లీన్ బౌల్డ్ వెనుదిరిగాడు. మనీష్ పాండే (2) క్యాచ్ అవుటయ్యాడు. మొత్తం మీద 15 ఓవర్లలో 27 పరుగులు మాత్రమే చేయగలిగారు. బౌలర్లకు స్వర్గధామమైన పిచ్పై శ్రీలంక పేసర్లు అద్భుతమైన పేస్ను, స్వింగ్ను రాబడుతున్నారు. ప్రస్తుతం క్రీజులో ధోని, భువనేశ్వర్ ఉన్నారు.