విజయవాడ, డిసెంబర్ 10 : ఈ నెల 9న విశాఖనుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేటు బస్సు కు తృటిలో ప్రమాదం తప్పింది. నగరంలోని బీఆర్టీఎస్ రోడ్ సీతన్నపేట గేట్ సమీపంలో ఎదురుగా వస్తున్న టాటా ఏస్ వాహనాన్ని బస్సు ఢీకొంది. దీంతో అదుపుతప్పిన బస్సు సమీపంలో ఉన్న వంతెన రెయిలింగ్ను ఢీకొని నిలిచిపోయింది. శనివారం అర్థరాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనలో టాటా ఏస్ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ వెంటనే స్పందించడంతో బస్సు కాలువలో పడకుండా ఆగింది. బస్సు ఒక్కసారిగా కుదుపులకు లోనుకావడంతో నిద్రలో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.