ధర్మశాల, డిసెంబర్ 10: ధర్మశాల వేదికగా భారత్-శ్రీలంకల మధ్య జరగనున్న తొలి వన్డే మ్యాచ్ లో లంక టాస్ గెలిచింది. దీంతో లంక ఫీల్డింగ్ ఎంచుకొని రంగలోకి దిగింది. కెప్టెన్ కోహ్లీ విశ్రాంతి తీసుకోవడంతో ఈ వన్డే సిరీస్కు రోహిత్ శర్మ సారథ్య బాధ్యతలు వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఓ వైపు వరుస సిరీస్ విజయాలతో వూపు మీదున్న టీమిండియా లంక పై విజయం సాధించాలని, మరో వైపు భారత్ను ఎలాగైనా పడగొట్టాలని లంక ఉవ్విళ్లూరుతున్నారు.