అహ్మదాబాద్, డిసెంబర్ 09 : గుజరాత్ అసెంబ్లీ శాసన సభ తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. పోలింగ్ శాతం 70శాతం పోలింగ్ నమోదైనట్లు గుజరాత్ చీఫ్ ఎన్నికల అధికారి బీబీ.స్వావిన్ ప్రకటించారు. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ కాస్త ఆలస్యమైనా ప్రశాంత౦గా ముగిశాయి. తొలి విడత పోలింగ్లో భాగంగా 89 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. కాగా పలు చోట్ల కొన్ని ఈవీఎంలకు బ్లూటూత్ కనెక్షన్ పెట్టి రిగ్గింగ్ చర్యలకు పాల్పడినట్లు కాంగ్రెస్ నేతలు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన ఈసీ వెంటనే ఈవీఎంలను మార్చింది. ఈ ఎన్నికల ఫలితాలు ఈ నెల 18 వ తేదీన వెలువడనున్నాయి.