అవినీతిపరులను నిర్ములిద్దాం :ఏసీబీ డీజీ ఠాకూర్

SMTV Desk 2017-12-09 18:21:46  ACB DG Takur, thirupathi

తిరుపతి, డిసెంబర్ 09 : పదేళ్లకోసారి కరెన్సీ మారితే అవినీతిని నిర్ములించవచ్చని, తిరుపతి ఏసీబీ డీజీ ఠాకూర్ అన్నారు. నేడు పద్మావతి మహిళా వర్సిటీ ఆడిటోరియంలో అవినీతి వ్యతిరేక దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఠాకూర్ మాట్లాడుతూ...ప్రభుత్వ పథకాల్లో 25 శాతం పక్కదారి పడుతున్నాయన్నారు. అవినీతి జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం సరికాదని ఠాకూర్ చెప్పారు. ఈ నేపధ్యంలో ఏసీబీ అధికారుల ఫోన్ నెంబర్లు, వాట్సాప్, 1100కు అవినీతిపరుల సమాచారం అందించాలని ఆయన సూచించారు. దేశం అవినీతి మార్గంలో కాకుండా మంచి మార్గంతో ముందుకు వెళ్లాలని వెల్లడించారు.