మార్గం మాధ్యమంలోనే ప్రసవించిన ఓ మహిళ

SMTV Desk 2017-12-09 17:58:42  anantapuram dist, bus, A woman gave birth baby

అనంతపురం, డిసెంబర్ 09 : వైద్య పరీక్షల కోసమని ఆర్టీసీ బస్సులో భర్తతో కలిసి కర్ణాటకలోని బళ్లారి బయల్దేరిన ఓ మహిళ బస్సులోనే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణానికి చెందిన అరుణ వైద్య పరీక్షల కోసం ఆర్టీసీ బస్సులో భర్తతో కలిసి కర్ణాటకలోని బళ్లారి బయల్దేరింది. బస్సు డి.హిరెహళ్‌ మండలం బాదన్‌హళ్‌ గ్రామానికి చేరుకోగానే అరుణకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. వెంటనే స్పందించిన బస్సు డ్రైవర్ సహకరించి ఓ చోట బస్సును ఆపారు. దీంతో గ్రామంలోని మహిళల సాయంతో బస్సులోనే పురుడుపోశారు. ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ మేరకు సమయస్ఫూర్తితో వ్యవహరించిన బస్సు డ్రైవర్‌, కండక్టర్‌లను అందరి ప్రశంసలు పొందారు.