భర్తను చంపించిన భార్య

SMTV Desk 2017-06-16 12:10:26  wife, killing, hasbend

హైదరాబాద్, జూన్ 16 : ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు కూడా పెరుగుతున్నాయి. పెళ్ళైన మహిళలు తన భర్త ను కాదని వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంటున్నారు. ఇలాంటి సంఘటనే హైదరాబాద్ లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా పానగలు మండలం దావచిపల్లికి చెందిన అమర చింత చిట్టెమ్మ (35), ఆమె భర్త నర్సింహ (45) పిల్లలతో కలిసి నగరంలోని సాగర్ రింగ్ రోడ్డులో నివాసం ఉంటున్నారు. నర్సింహ కూలి పని, భార్య చిట్టెమ్మ మంద మల్లమ్మ గార్డెన్ లో పనిచేస్తుంటారు. అదే గార్డెన్ లో పనిచేసే నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం రాయినిగుడేనికి చెందిన కడాయి చందు (26) తో చిట్టెమ్మ వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్త నర్సింహ కు తెలియడంతో వాళ్ళిద్దరికీ రోజూ గొడవలు జరుగతుండేవి. ఈ నెల 4 న ప్రియుడు చందును కలిసిన చిట్టెమ్మ అతనికి రూ. 30 వేల ఇచ్చింది. ఆ డబ్బు తీసుకున్న చందు అతని స్నేహితుడు యాదగిరి (32), గుంటూరు జిల్లాకు చెందిన శ్యాంసన్ తో కలిసి నర్సింహను చంపడానికి రంగం సిద్ధం చేసారు. అదే రోజు చందు స్నేహితులు నర్సింహ కు మద్యం తాగించి, నర్సింహ ను ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు తీసుకెళ్ళి ఉరి వేసి, అతని పై పెట్రోల్ పోసి కాల్చి చంపారని, పోలీసులకు గుర్తు తెలియని శవం లభ్యమవ్వడంతో కేసు నమోదు చేసి విచారణ జరుపగా అన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయని వారు వెల్లడించారు. ఈ కేసును చాలా తొందరుగా ఛేదించిన సీఐ గోవింద్ రెడ్డిని, ఎస్ఐ కృష్ణంరాజులను డీసీపీ వెంకటేశ్వరావు అభినందించారు.