న్యూఢిల్లీ, డిసెంబర్ 9: భీమ్ యాప్ లేదా యూపీఐ ద్వారా రైల్ టిక్కెట్లను బుక్ చేసుకునే వారికీ దేశీయ రైల్వే బంపర్ ఆఫర్ ప్రకటించింది. అదేంటంటే.. నెలవారీ లక్కీ డ్రా స్కీమ్ను ప్రారంభించి, ఈ డ్రాలో గెలుపొందిన వారికి ఉచితంగా ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పించడం. ప్రతి నెలా తొలి వారంలో ముందటి నెలలోని ఐదుగురు లక్కీ ప్రయాణికులను కంప్యూటరైజడ్ లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి, గెలుపొందిన ఐదుగురికి మొత్తం రైల్వే టిక్కెట్ ధరను వెనక్కి ఇచ్చేస్తారు. ఈ లక్కి ఆఫర్ కేవలం యూపీఐ ఆప్షన్ల ద్వారా ఐఆర్సీటీసీ వెబ్సైట్పై విజయవంతంగా బుక్ చేసుకున్న కస్టమర్లకు మాత్రమే.