చెన్నై, డిసెంబర్ 09 : తమిళనాడు ఆర్కే నగర్ నియోజకవర్గంలో స్వాతంత్ర్య అభ్యర్థిగా ప్రముఖ నటుడు విశాల్ వేసిన నామినేషన్ ఇటీవల తిరస్కరణకు గురైంది. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి వేలుస్వామిని తొలగిస్తూ ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. నామినేషన్ పేపర్లను తిరస్కరిస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదానికి దారితీయడంతో ఆయనపై ఈ వేటు వేసినట్లు సమాచారం. కాగా నామినేషన్ పత్రాలపై చేసిన రెండు సంతకాలు పోర్జరీ చేసినవని ఆయన నామినేషన్ను తిరస్కరించారు. దీనిపై విశాల్ వివరణ ఇచ్చిన తర్వాత అంగీకరించి, మరికాసేపటికే తిరస్కరిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో ఈసీ యంత్రాంగం రిటర్నింగ్ అధికారి వ్యవహార శైలిని పరిశీలిస్తూ ఆయనను బదిలీ చేయాలని చెప్పడంతో వేలుస్వామిని ఎన్నికల కమిషన్ బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.