విజయవాడ, డిసెంబర్ 09 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఆదర్శంగా నిలిచారని టీడీపీ ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. ఏడేళ్లుగా ప్రతిసారి ఆస్తుల వివరాలను ప్రకటిస్తున్న ఆయనను ప్రతిపక్ష నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని తెలిపారు. ఆస్తులను ఎలా ప్రకటిస్తారో లెక్కల మాస్టారు విజయసాయిని అడిగితే బాగా చెప్పుతారని విమర్శించారు. టీడీపీ హయాంలోనే ఎక్కువ డీఎస్సీలన్నారు. ఇప్పుడున్న టీచర్లలో 70 శాతం మంది అలా వచ్చిన వారేనని ఆయన చెప్పారు. టీడీపీ హయాంలోనే 15 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వచ్చాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనూ చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారని దినకర్ వెల్లడించారు.