న్యూఢిల్లీ, డిసెంబర్ 09 : ఆధార్ కార్డుతో పాన్ కార్డును అనుసంధానం చేసే ప్రక్రియకు ఈ డిసెంబర్ తో గడువు ముగుస్తున్నా.. ఇంకా చాలా మంది ఆధార్ లింక్ చేసుకోలేదు. ఈ నేపథ్యంలో కేంద్రం గడువును మరోసారి పొడిగించింది. డిసెంబరు 31న ముగియనున్న ఈ గడువును వచ్చే సంవత్సరం మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఆధార్ కార్డు అనుసంధానాన్ని మరింత సులభం చేసేందుకే ఈ గడువును పొడిగించినట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రకటించింది.