కలకత్తా, డిసెంబర్ 9: జంషెడ్పూర్ విద్యార్థులు సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రొగ్రామ్ కింద 364 మంది విద్యార్థులు 100 శాతం ప్లేస్మెంట్ పొందారని జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ తెలిపింది. ఈ ఇంటర్న్షిప్ ప్లేస్మెంట్ ప్రాసెస్లో ప్రైస్వాటర్హౌజ్కాపర్స్, కోకాకోలా, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు పాల్గొన్నాయి . ఇంటర్న్లుగా నియమించుకున్న వీరికి సగటు వేతనం 20 శాతం పైగా పెరిగి, రెండు నెలలకు గాను రూ.5 లక్షలను ఆఫర్ చేసింది. పలు కొత్త కంపెనీలు కూడా ఈ రిక్రూటర్స్ జాబితాలో ఉన్నాయి.